Baahubali: కొత్త సీన్స్‌తో ప్రేక్షకుల ముందుకు బాహుబలి ది ఎపిక్!!

Baahubali: భారత సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన బాహుబలి (Baahubali) మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic)’ పేరుతో రెండు పార్ట్‌లను కలిపి కొత్త వెర్షన్‌గా విడుదల చేయబోతున్నారు.

Baahubali Returns With Added Scenes

ఈసారి సాధారణ రీ రిలీజ్ కాదు. దర్శకుడు రాజమౌళి స్వయంగా ఎడిటింగ్, సౌండ్ డిజైన్ (Sound Design) పర్యవేక్షించారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (Senthil Kumar) ప్రకారం, గతంలో చూపించలేకపోయిన కొన్ని విజువల్స్, కొత్త సీన్స్ ఈ వెర్షన్‌లో చేర్చబడ్డాయి. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ఇప్పటికే ప్రారంభమయ్యాయి. థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ రీ రిలీజ్ కూడా రూ.100 కోట్ల వసూళ్ల మార్క్ దాటే అవకాశం ఉంది. ప్రభాస్, రాజమౌళి కలయిక మళ్లీ మాయ చేయనుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

సినిమా నిడివి సుమారు 3 గంటల 45 నిమిషాలు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన తారాగణం కాగా, కీరవాణి సంగీతం మరోసారి మ్యాజిక్ సృష్టించనుంది. కొత్త సీన్స్‌తో, కొత్త సౌండ్‌తో రాబోతున్న ఈ వెర్షన్ థియేటర్లలో మరోసారి బాహుబలి ఫీవర్ (Baahubali Fever) రగిలించే అవకాశం ఉంది.