Mythri Movie Makers: హిందీ నటుడు సన్నీడియోల్ గదర్ 2తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌తో మళ్లీ పుంజుకున్న ఈ ప్రముఖ నటుడు నాలుగు దశాబ్దాలకు పైగా నటించి కెరీర్‌లో దాదాపు 100 సినిమాలు చేసాడు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ హీరో తో కలిసి హిందీ చిత్రాన్ని ప్రారంభించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమా కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Mythri Movie Makers Sunny Deol Movie

ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుని ఈరోజు హైదరాబాద్‌లో మొదలైంది. “మాస్ ఫీస్ట్ కోసం లోడ్ అవుతోంది. అనే ట్యాగ్ లైన్ చిత్ర బృందం విడుదల చేసింది. ఇది పూర్తిగా హిందీలో తెస్తున్న సినిమా కాగా ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నాడు. గోపీచంద్ మలినేనికి ఇది తొలి హిందీ చిత్రం. దక్షిణాది దర్శకులు బాలీవుడ్ స్టార్లతో తెరకెక్కించే చిత్రాలపై ఉత్తరాది ప్రేక్షకులు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు.(Mythri Movie Makers)

Also Read: Tollywood: మారిన సినిమా రిలీజ్ లు.. ఈ సంవత్సరం రాబోయే బడా సినిమాలివే!!

ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి భారీ సంస్థలు ముందుకు రావడం విశేషం. ఈ రెండు సంస్థలు ఈ సినిమా ను ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాయి. రోజు హైదరాబాద్‌లో ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రం అధికారికంగా మొదలైంది.

క్రాక్, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన స్క్రిప్ట్ తో #SDGMని భారీ యాక్షన్ చిత్రంగా రూపొందిస్తారని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్-రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 22న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.