Samantha: సమంత, నయనతార, విజయసేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డబల్ ట్రబుల్. ఈ పేరుతో జియో సినిమా ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం డబల్ ట్రబుల్ విడుదల అయినట్లు జియో సినిమా ఓటిటి అఫీషియల్ గా ప్రకటించింది.

Samantha, Nayantara comedy movie come to digital streaming

ఈ సినిమా పోస్టర్ ను పంచుకుంది కూడా. 2022లో తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు ఆరేళ్ల అనంతరం హిందీ వెర్షన్ ఓటీటీలోకి రావడం విశేషం. ఇక ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ డైరెక్షన్ వహించాడు. నయనతార స్వయంగా ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది.

Also Read: Amitabh Bachchan: నిర్మాత కాళ్లు మొక్కిన అమితాబచ్చన్.. కారణం తెలిస్తే షాక్..!

ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ముందు విజయసేతుపతి ఒక విలన్ గా మాత్రమే ఉన్నారు. కానీ ఈ చిత్రం తర్వాత నుంచి విజయసేతుపతిని హీరో గా కూడా గుర్తు పెట్టుకుంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం రిలీజ్ తరువాత సమంత,నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్ కి మంచి బజ్‌ ఏర్పడింది.

Samantha, Nayantara comedy movie come to digital streaming

హీరో హీరోయిన్ల నటన బాగున్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ కామెడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ టాక్ ని దక్కించుకుంది. ఈ నెగటివ్ టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ తమిళం ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ప్రస్తుతం గత కొంతకాలం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇటీవల కోల్కొని మరోసారి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.(Samantha)