Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. 175 స్థానాలకు 175 గెలుస్తామని… అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డికి… అత్యంత దారుణంగా షాక్ తగిలింది. ఎవరు ఊహించని విధంగా కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీకి రావడం జరిగింది. దీంతో వైసిపి పార్టీలో… కల్లోలమే చోటుచేసుకుంది. Jagan

jagan mohan reddy new look adurs

ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఫైర్ బ్రాండ్ నేతలు, కాస్త జనాల్లో ఉండే నేతలు కూడా ఓడిపోయారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి మినహా… పెద్ద నాయకులు ఎవరూ కూడా గెలవలేదు. దాదాపు అందరూ నేతలు ఓడిపోవడం జరిగింది. అయితే ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయింది. Jagan

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డిపై 38 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేల తిరుగుబాటు ?

ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు… వైసిపి పై రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసిపి నేతలపై కేసులు పెట్టడం… వైసీపీ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, వైసీపీ ప్రభుత్వం పై బురద జల్లడం లాంటివి టిడిపి చేస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసిపి పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. Jagan

ఈ రచ్చ నుంచి కాస్త రిలాక్స్ కావడానికి తాజాగా బెంగళూరుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. తన ఫామ్ హౌస్ లో.. రిలాక్స్ అవుతున్నారు. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింపుల్ గా ఓ లాల్చీ ధరించి… బ్లాక్ పాయింట్ వేసుకొని ఈ కనిపించారు జగన్. అటు వైయస్ భారతి కూడా సింపుల్ డ్రెస్ లో… కొంతమంది పేద ప్రజలతో… కలిసి ఫోటో దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. Jagan