Prabhas did such a thing for me.. Actress comments

Prabhas: టాలీవుడ్ నటి హంస నందిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా అంత గుర్తింపు తెచ్చుకో లేకపోయినా ఈమె అనంతరం స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. అంతా బాగానే సాగుతుంది అనుకున్న టైంలో క్యాన్సర్ బారిన పడింది.

ఇక అనంతరం విదేశాల్లో చికిత్స తీసుకుని పూర్తిగా నయం అవ్వడంతో ఇండియా చేరుకున్న హంస నందిని ఈ మధ్యకాలంలో వరస ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. అందుకే ఎవరితోనూ మాట్లాడరు. ఆయనతో నేను మిర్చి సినిమా చేశాను. అందులో టైటిట్ షాంకు స్టఫులు వేసా. ఇక మూవీ అనంతరం నేను వేరే చిత్రంలో బిజీ అయిపోయా.

Prabhas did such a thing for me.. Actress comments

రిలీజ్ టైం లో కూడా హైదరాబాదులో లేను. కొన్ని రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ పనిమీద హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఓ పార్టీలో ప్రభాస్ కలిశాడు. మిర్చిలో మీ సాంగ్ సూపర్ హిట్ అయింది తెలుసా అని అడిగారు. దానికి నేను మూవీ చూడలేదు అని చెప్పాను. దీంతో వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పారు. అలాగే ఏ టైం కి ఆ సాంగ్ వస్తుందో కూడా చెప్పడంతో కరెక్ట్ గా అదే టైం కి వెళ్లి సినిమా చూశాను ” అంటూ చెప్పుకొచ్చింది హంస నందిని. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.