Mahesh Babu is the Heroine who married the hero after doing occult worship

Heroine: ఏంటి ఈ మహేష్ బాబు హీరోయిన్ తన భర్తని క్షుద్ర పూజల ద్వారా దక్కించుకుందా.. పెళ్లి చేసుకోబోయే ముందు ఆ హీరోని క్షుద్ర పూజలు చేసి తన వశం చేసుకుందా.. వింటుంటేనే చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఇది నిజమేనా.. ఇంతకీ వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. భర్తని క్షుద్ర పూజల ద్వారా పెళ్లి చేసుకుంది అంటూ వార్తల్లో వస్తున్న మహేష్ బాబు హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కి కియారా అద్వానీ..

Mahesh Babu is the Heroine who married the hero after doing occult worship

కియార అద్వానీ గత ఏడాది తన ప్రియుడు హీరో అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లిపై తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది.అదేంటంటే సిద్ధార్థ్ మల్హోత్రా వీరాభిమాని అయిన మీనూ వాసుదేవ్.. ఈయన తాజాగా తన x ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు. అదేంటంటే.. సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా అద్వాని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట. డబ్బు పరంగా అందం పరంగా, ఫిజికల్ గా ఇలా ఎన్నో రకాలుగా కియారా సిద్ధార్థ్ ని వశం చేసుకోవాలని చూసినప్పటికీ ఆయన ఎక్కడ లొంగక పోయేసరికి చివరికి బ్లాక్ మ్యాజిక్ చేసి అతన్ని పెళ్లి చేసుకుంది(Heroine)

Also Read: Chiranjeevi: పాపం ఆ హీరోయిన్ పరువు పోగొట్టిన చిరంజీవి కూతురు.. మరీ అంత దారుణమా..?

అంటూ కొంతమంది వ్యక్తులు సిద్ధార్థ్ మల్హోత్రా వీరాభిమాని అయిన మీనూ వాసుదేవ్ కి ఒక కట్టు కథ చెప్పి నమ్మించి మీ హీరోకష్టాల్లో ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం ప్రాణాపాయం ఉంది అంటూ 50 లక్షలు కొట్టేసారట . ఇదే విషయాన్ని మీనూ వాసుదేవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.సిద్ధార్థ్ ఫ్యాన్ పేజీలో నేను ఈ మోసానికి గురయ్యాను. సిద్ధార్థ్ పి ఆర్ టిం అంటూ కొంతమంది చెప్పుకొని నా దగ్గర నుండి డబ్బులు గుంజారు. ఆయనని ఆ ఇబ్బంది నుండి బయట పడేయాలి.

Mahesh Babu is the Heroine who married the hero after doing occult worship

సిద్ధార్థ్ కి ప్రాణాపాయం ఉంది అని చెప్పి వారానికి ఒకసారి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అలా నేను సిద్ధార్థ్ కోసం 50 లక్షలు కోల్పోయాను.ఓసారి నాకు సిద్ధార్థ్ తో మాట్లాడిపించే అవకాశం కూడా కల్పించారు. కానీ అక్కడ మాట్లాడింది సిద్ధార్థ్ కాదు వేరే వ్యక్తి. ఈ విషయం మొత్తం తెలుసుకోకుండానే నేను వారి మాయలో పడిపోయాను.అయితే ఈ ఫ్యాన్ పేజీ లో సిద్ధార్థ్ కూడా ఫాలో అవుతున్నాడు అంటూ ఎక్స్ వేదికగా మీనూ వాసుదేవ్ తన బాధను వెళ్ళబోసుకున్నాడు. ఇలా సిద్ధార్థ్, కియారా అద్వాని పేరిట 50 లక్షలు కోల్పోయినట్టు మీనూ వాసుదేవ్ చెప్పాడు.(Heroine)