Vijay thalapathi: ఈ టాలీవుడ్ హీరో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మంచి పేరును సంపాదించుకున్న విజయ్ . తమిళ్ ఇళయ దళపతి విజయ్, హీరోయిన్ త్రిష కలిసి తీసుకున్న సెల్ఫీ మీడియాలో తెలుగు చూడగానే వారిద్దరిపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే..ఇద్దరి గురించి సింగర్ సుచిత్ర భారీ బాంబు పేల్చింది. ఆ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇటీవల 50 వ పుట్టినరోజును జరుపుకున్న విజయ్ నేపథ్యంలో త్రిషతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరూ లిప్ట్ లో దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఆ ఫోటోలో ను ఎవరు వైరల్ చేసి బయటకు తెచ్చారో అనే విషయంపై సుచీ లీక్స్ తో సంచలనం రేపింది. సుచిత్ర తమిళ మీడియాతో మాట్లాడుతూ… విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి…త్రిషను వివాహం చేసుకోవాలని అనుకొంటుననారు. కొన్నేళ్లుగా విజయ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ సపరేట్గా జీవిస్తున్నారు అనే చర్చ జరుగుతున్నదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ గురించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలయింది. గతంలో ఏంజీఆర్, జయలలిత మాదిరిగా..విజయ్, త్రిష బంధం ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పింది.

Vijay is going to divorce his wife

సంగీతంలో ఆయన విభేదాలు చిన్నవే..కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల పెద్దగా ఆయ్యాయి అని సుచిత్ర అభిప్రాయపడింది. విజయ్ తో త్రిష దిగిన ఫోటో ప్యూహాత్మకంగా బయటకు వచ్చింది. దాంతో వారిద్దరి రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో అది బయటకు వచ్చింది. వారు ఫోటో రిలీజ్ చేసిన ఉద్దేశం కూడా నెరవేరింది. వారిద్దరి మధ్య చీకటి బంధానికి అధికారికంగా గుర్తింపు లభించింది అని సుచిత్ర ఆరోపించింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను, సుచిత్ర చేసిన వ్యాఖ్యలను విజయ్ ఫ్యాన్స్ ఖండించారు. అందులో వాస్తవాలు లేవు. పాత ఫోటోను వైరల్ చేసి విజయ్ ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారు అని తిప్పి కొట్టారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఇబ్బందిగా మారిన కొందరు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వారు కౌంటర్ ఇస్తున్నారు.