Vijayashanti fire on Chiranjeevi

Vijayashanti: లేడీ అమితాబ్ గా ఇండస్ట్రీలో పేరున్న విజయశాంతి కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించింది.ఈమె రాజకీయాల్లో కూడా రాణించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గతంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి.అయితే ఈ కామెంట్లు ఆమె చిరంజీవిని ఉద్దేశించే చేసింది అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

Vijayashanti fire on Chiranjeevi

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రాజకీయాల్లో కొనసాగలేక పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇక అప్పట్లో తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో చాలామంది హీరోలను విజయశాంతి తెలంగాణకు సపోర్ట్ చేయమని అడిగిందట.కానీ ఎవరు కూడా ముందుకు రాలేదట. దాంతో ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ.. సినిమాలో హీరోయిజం చూపెట్టడం కాదు.నిజ జీవితంలో కూడా ఉండాలి.సినిమాల్లో అది చేసాం ఇది చేసామని మాట్లాడడం కాదు బయట కూడా అలాగే ప్రవర్తించాలి. (Vijayashanti )

Also Read: Balakrishna: బాలకృష్ణ చేసిన పనికి పరిగెత్తించుకుంటూ కొట్టిన స్టార్ హీరో.. ఎవరంటే.?

చాలామంది టాలీవుడ్ హీరోలు ముసుగు దొంగలు అంటూ మాట్లాడింది.అంతే కాదు చిరంజీవి ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది.. పార్టీ పెట్టడంతోనే ఎవరు సీఎం అయిపోరు. అలా కావాలని కల కనకూడదు. ఎందుకంటే సేవ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు. అలా కాకుండా ఓవర్ నైట్ లో అయిపోవాలి అంటే అది కుదరదు. రామానాయుడు లాగా అందరూ సీఎంలు అయిపోరు కదా.రాజకీయాల్లోకి రావడంతోనే డబ్బులు వచ్చి,పదవులు రావాలంటే కుదరదు.సుఖాలకు అలవాటు పడ్డారు.

 Vijayashanti fire on Chiranjeevi

ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి అలాంటి ఉద్దేశం లేనివారు రాజకీయాల్లోకి రాకూడదు.. అంటూ విజయశాంతి అప్పట్లో చేసిన కామెంట్స్ దుమారం సృష్టించాయి. ఇంటర్వ్యూ విన్న తర్వాత అందరూ చిరంజీవిని ఉద్దేశించే విజయశాంతి ఆ కామెంట్స్ చేసిందని మాట్లాడుకున్నారు. దాంతో వీరి మధ్య కాస్త గ్యాప్ కూడా ఏర్పడింది. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్ సమయంలో చిరంజీవి విజయశాంతిని హగ్ చేసుకుని గతంలో చేసిన విమర్శలను ఫన్నీగా గుర్తు చేసుకున్నారు(Vijayashanti )