raj tarun

Raj Tarun: టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో మాల్వీ మల్హోత్రాను ఏ2గా, మయాంక్ మల్హోత్రాను ఏ3గా నార్సింగి పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై సెక్షన్ 420, 493, 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. లావణ్య తన ఫిర్యాదు కాపీలో పలు విషయాలను పేర్కొంది. రాజ్‌తరుణ్ తనను కలిసినప్పటి నుంచి ఇటీవల జరిగిన సంఘటనలను ఆమె ఈ ఫిర్యాదు కాపీ లో ప్రస్తావించారు.

Raj Tarun Lavanya Case Twist

2008 నుంచి రాజ్‌తరుణ్ తనకు తెలుసునని లావణ్య పేర్కొంది. రాజ్‌తరుణ్ ఆమెకు 2010లో ప్రపోజ్ చేశాడట. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.  గతంలో రాజ్ తరుణ్‌కి రూ.70 లక్షలు ఇచ్చినట్లు చెప్తుంది.  తాను 2016లో రాజ్‌తరుణ్‌ వల్ల గర్భవతి అయ్యానని, రెండో నెలలో సర్జరీ చేయించుకున్నానని చెప్పింది. రాజ్ తరుణ్ హాస్పిటల్ బిల్లులన్నీ కట్టాడని చెప్పింది. తనపై గతంలో వచ్చిన డ్రగ్స్ కేసులను కూడా ఆమె ప్రస్తావించారు. ఆ కేసులో తనను రాజ్‌తరుణ్‌, మాల్వీ ఇరికించారని ఆమె పేర్కొంది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Also Read: Kamal Haasan: కమల్ హాసన్ సినిమా కు చుక్కెదురు.. విడుదల ఆపాలని కోర్టు నోటీసు!!

మాల్వీ మల్రోత్రా మరియు ఆమె సోదరుడు మయాంక్ మల్రోత్రా ఆమెను చంపుతామని బెదిరించారు. ఈ విషయంలో లావణ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. అదే సమయంలో, లావణ్య తరపు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్యకు చాలా అన్యాయం చేశాడని దిలీప్ అన్నారు.

అలాగే 700లకు పైగా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. లావణ్యను కొట్టడమే కాకుండా బీరు బాటిళ్లతో చిత్రహింసలకు గురిచేశాడని దిలీప్ చెప్పాడు. రాజ్ తరుణ్ లావణ్యను 11 ఏళ్లుగా వాడుకుంటున్నాడు. ఆమె గత 11 ఏళ్లలో రెండుసార్లు గర్భవతి అయిందన్నాడు. రాజ్ తరుణ్ కూడా లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో సంబంధం కలిగి ఉందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి వ్యవహారం ఏవిధంగా తేలుతుందో చూడాలి.