Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పడుతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో… వైసిపి పార్టీ కుప్పకూలింది. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని… వైసిపి పార్టీ మొదటి నుంచి చెప్పుకు వచ్చింది. అయితే చివరికి వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే వైసిపి గెలుచుకోవడం జరిగింది. Jagan

Topudurthi Kakkurthi scams hanging around Jagan’s neck 200 crores together

దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా… వైసిపి పార్టీ కోల్పోయింది. అంతేకాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం… జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రభుత్వంలో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి… వైసిపి కార్యాలయాలను కూల్చివేయడం, వైసీపీ నేతలపై కేసులు పెట్టడం జరుగుతుంది. Jagan

Also Read: Vijayashanthi: చంద్రబాబు,రేవంత్ లను తరిమి కొడతానని రాములమ్మ హెచ్చరిక..కేసీఆర్ గేమ్ షూరు అయ్యిందా ?

అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ తీరాన కట్టిన కట్టడాలపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలా వరుసగా వైసీపీని దాడి చేస్తున్న టిడిపి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోట బద్దలు కొట్టేందుకు… రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే జగనన్న… ఇచ్చిన సెంటు స్థలాలలో ఇల్లు కట్టిస్తామని.. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ఇండ్లను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి… రాంక్రీట్ సంస్థ అడ్వాన్స్ తీసుకుంది. Jagan

ఆ సంస్థ ఖాతాకు బిల్లుల రూపంలో…200 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించినప్పటికీ నిర్మాణాలు మాత్రం జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చింది. కూటమికి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి… ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ మొదలు పెట్టిందట. ఒకవేళ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తే.. ఈ ఉచ్చు జగన్ మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. Jagan