Aishwarya Rai Abhishek Bachchan Divorce new

Aishwarya Rai: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మరియు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ వివాహ్వం ముంబైలో జరగగా అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలకు అతిరథ మహారధులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకి టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.సినీ తారలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా సందడి చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్ జాన్ సెనా, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

Aishwarya Rai Abhishek Bachchan Divorce new

నిజానికి చెప్పాలంటే ఈ పెళ్లికి వారం రోజుల ముందు నుంచే బాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. పెళ్లికి ముందు జరిగిన అన్ని వేడుకలకు బీటౌన్ హాజరైంది. నిన్న జరిగిన ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణ్ వీర్, దీపిక, సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్, ధోనీ, సచిన్, రామ్ చరణ్, రజనీకాంత్, మహేష్ బాబు, వెంకటేష్ వంటి తదితరులు హాజరయ్యారు. అయితే, అనంత్ అంబానీ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

బాలీవుడ్‌లో కనువిందైన జంట గా పేరున్న ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌ లు  విడాకులు తీసుకుంతున్నారన్న పుకార్లు ఇప్పుడు కూడా మొదలయ్యాయి. ఈ వివాహానికి సినీ తారలంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. అయితే ఐశ్వర్య వారి వెంట లేదు. కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య పెళ్లికి హాజరుకావడం లేదన్నారు. అయితే కొంత సమయం తర్వాత ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి అనంత్ పెళ్లికి ఒంటరిగా వచ్చింది.

Also Read: Pan World Movies: ముందుంది ముసళ్ళ పండగ.. పాన్ ఇండియా రేంజ్ దాటుతున్న తెలుగు సినిమా!!

దీంతో వీరిద్దరి విడాకుల వార్త మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్య దూరంగా ఉంటుంది…అభిషేక్, ఐశ్వర్య విడిపోయారు. అందుకే వారు వేరు వేరు గా వచ్చారని అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై అమితాబ్ కుటుంబం కానీ, ఐశ్వర్య, కానీ, అభిషేక్ కానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు అమితాబ్ కుటుంబం, ఐశ్వర్యల విడాకుల వ్యవహారం మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. ఇప్పటికైనా వీరు స్పందిస్తారా అనేది చూడాలి.