A rare honor for Ram Charan.. Is that why he traveled to London

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ల పెళ్ళికి తన సతీమణి ఉపాసనతో హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్ ఉపాసన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.అయితే పెళ్లి వేడుక పూర్తి చేసుకున్నాక ఉపాసన తిరిగి హైదరాబాద్ కి వచ్చేస్తే రామ్ చరణ్ మాత్రం ముంబై నుండి లండన్ ఫ్లైట్ ఎక్కాడు. దీంతో చాలామంది నెటిజన్స్ ఏదైనా పని కోసం వెళ్తున్నాడు కావచ్చు లేదా ఏదైనా సినిమా షూటింగ్ కోసం కావచ్చు అని అనుమానాలు వ్యక్తం చేశారు.

A rare honor for Ram Charan.. Is that why he traveled to London

కానీ తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే రామ్ చరణ్ కి త్వరలోనే ఓ అరుదైన గౌరవం దక్కబోతుందట.ఇప్పటివరకు ప్రభాస్,మహేష్ బాబు,అల్లు అర్జున్ లు దక్కించుకున్న గౌరవం రామ్ చరణ్ కి కూడా దక్కబోతున్నట్లు తెలుస్తోంది.అదేంటంటే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట.(Ram Charan)

Also Read: Tamannaah: బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిన తమన్నా.. మరో వ్యక్తితో ఎఫై**.?

ఇప్పటికే ఈ మ్యూజియంలో మహేష్ బాబు,అల్లు అర్జున్, ప్రభాస్ ల మైనపు విగ్రహాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే వీరికి దక్కిన గౌరవం రామ్ చరణ్ కి కూడా దక్కబోతున్నట్టు తెలుస్తోంది.రామ్ చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.

A rare honor for Ram Charan.. Is that why he traveled to London

ఇక ఇందులో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాంచరణ్ దగ్గర ఉన్న పెట్ డాగ్ రైమ్ ని కూడా తయారు చేస్తున్నారట. రామ్ చరణ్ రైమ్ ని ఎత్తుకున్న మైనపు విగ్రహం తయారు చేయడం కోసం ఆయనని కొలతలు అడగగా..రామ్ చరణ్ తన పెట్ డాగ్ తో సహా లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మ్యూజియం వాళ్లకి రామ్ చరణ్ కొలతలు ఇవ్వడానికే వెళ్లారు అంటూ టాలీవుడ్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగే..(Ram Charan)