Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత… ఆ పార్టీ నేతలను… తెలుగుదేశం పార్టీ ఒక ఆట ఆడుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైసిపి కార్యాలయాలను, ఆ నేతలపై కేసులు పెడుతూ… కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. Roja

Roja meets junior ntr

పుంగనూరు టైగర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారిని ఇప్పటికే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. వారిపై వరుసగా కేసులు పెడుతూ చుక్కలు చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఇలాంటివి నేపథ్యంలో…. నగరి నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయిన రోజమ్మ… తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారట. Roja

Also Read: BRS: KCRకు హరీష్ రావు వెన్నుపోటు ?

చెన్నైలో జరిగిన.. ఓ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి వైసిపి పరిస్థితులను వివరించారట రోజా. అయితే… జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రోజాను ఏమాత్రం పట్టించుకోలేదని సమాచారం. తనను రాజకీయాల్లోకి లాగొద్దని… అసలు ఏపీ గురించి తన దగ్గర ప్రస్తావన చేయకూడదని కోరారట జూనియర్ ఎన్టీఆర్. Roja

దీంతో కంగు తిన్న రోజా… సైలెంట్ గా అక్కడినుంచి జారుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, విడుదల రజిని కూడా జూనియర్ ఎన్టీఆర్ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు రోజాను కూడా ఏమాత్రం పట్టించుకోలేదని ఈ సమాచారం. Roja