Who is the person who came to Keerthy Suresh house to marry her

Keerthy Suresh: మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి వెండితెర మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇండస్ట్రీలోకి వచ్చింది మలయాళం లో వచ్చిన గీతాంజలి అనే మూవీ తో. ఇక కీర్తి సురేష్ తల్లి మేనక కూడా హీరోయిన్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు సులువుగా వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే తప్పే.. ఎందుకంటే తల్లి హీరొయిన్ అయినా కూడా కీర్తి సురేష్ అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడిందట.అలా ఎట్టకేలకు మహానటి మూవీ ద్వారా కీర్తి కి గుర్తింపు లభించింది.

Who is the person who came to Keerthy Suresh house to marry her

ఇక అంతకు ముందు వచ్చిన నేను శైలజ సినిమా కూడా కీర్తి సురేష్ కి మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది.అలాగే రెమో, నేను లోకల్ వంటి సినిమాలు టాలీవుడ్ లో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా నానితో నటించిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గత ఏడాది వచ్చిన భోళా శంకర్ సినిమా బెడిసి కొట్టినప్పటికీ ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో బాలీవుడ్ ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. (Keerthy Suresh)

Also Read: Ismart Shankar: పూరీ సార్.. మారిన లెక్కలు..కష్టమే గురూ!!

అలాగే ప్రస్తుతం రఘు తాత అనే సినిమాలో కూడా చేసింది.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కి ఫిలింఫేర్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దసరా లోని ఆమె నటనకి గాను ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. అయితే కీర్తి సురేష్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్రేజీయెస్టు ఫ్యాన్ మూమెంట్ ఇదే.

 Who is the person who came to Keerthy Suresh house to marry her

అదేంటంటే ఓసారి నా అభిమాని నేరుగా నా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటూ డైరెక్ట్ గా చెప్పేసాడు. ఆ వ్యక్తికి నేనంటే చచ్చేంత ప్రేమ.. అందుకే నా అభిమాని అలా చెప్పారు.. ఇక ఆయన మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా జీవితంలోనే క్రేజీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.(Keerthy Suresh)