August 15 Marks a Major Date for Tollywood

August 15: ఒక మంచి, సరైన విడుదల తేదీ దొరికితే దాన్ని ఏ నిర్మాత కూడా వదిలి పెట్టుకోదలుచుకోడు. ఒక మంచి విడుదల తేదీ వచ్చిందంటే చాలు ఆ తేదీ కోసం నిర్మాతలు పోటీల మీద పోటీలు పడుతున్నారు. ఆ విధంగా ఆగస్టు 15వ తేదీకి కోసం ముగ్గురు నిర్మాతలు.. అది కూడా సినిమా పరిశ్రమలోనే పెద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారు ఒకరిని మించి ఒకరు పోటీపడుతూ వారి సినిమాలను విడుదల చేస్తున్నారు.

August 15 Marks a Major Date for Tollywood

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని గత ఏడాదినే చిత్ర బృందం ప్రకటించింది. తమ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు.. సోలో రిలీజ్ రావడం మంచిది అని ఈ సినిమా నిర్మాత చార్మి భావిస్తున్న సమయంలో సడన్ గా రెండు సినిమాల రాక ఈ చిత్రం యొక్క కలెక్షన్ల పై భారీ దెబ్బ పడేలా ఉందని చెప్పవచ్చు. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా ఆగస్టు 15వ తేదీన రావడానికి సిద్ధమయ్యింది.

Also Read: Raviteja: పూరీ, రవితేజ ల మధ్య చెడిందా? అసలేమైంది!!

ఆ విధంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది ఓ పెద్ద దెబ్బ. ఇలా పోటీ పడి సినిమా లు విడుదల చేయడం రెండు సినిమాలకు అంత మంచిది కాదని విశ్లేషకుల అభిప్రాయం. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు ఈ తేదీన విడుదల కు మరొక చిన్న సినిమా కూడా ఉంది. ఈ తేదీన రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంది గీత ఆర్ట్స్ బ్యానర్. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘ఆయ్’. ఆగస్టు 15వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంది.

ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు భారీ సినిమాలు వస్తున్న సైతం ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఈ సినిమా యొక్క కంటెంట్ పట్ల వారికి ఉన్న నమ్మకం అని తెలుస్తుంది. మరి ఈ మూడు చిత్రాలలో ఎవరిది పై చేయి గా నిలుస్తుందో చూడాలి. ఇప్పటివరకైతే మిస్టర్ బచ్చన్ సినిమా కు మంచి బజ్ నెలకొంది.