Prabhas and Trisha to Reunite in Sandeep Reddy Vanga Movie

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలోని ‘రాజాసాబ్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేస్తుండగా ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘పౌజి’ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఆ విధంగా ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని సినిమాను మొదలుపెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని షూటింగ్ కు సిద్ధమైన నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా మరికొన్ని రోజులు ప్రభాస్ రాక కోసం వేచి చూడవలసింది.

Prabhas and Trisha to Reunite in Sandeep Reddy Vanga Movie

ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సందీప్ రెడ్డి ఇప్పుడు ఆ సినిమా యొక్క సీక్వెల్ పనులలో నిమగ్నమై ఉన్నాడు. స్పిరిట్ కోసం ప్రభాస్ డేట్లు ఇచ్చే లోపు ఈ సినిమాను పూర్తి చేసి రాబోతున్నాడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమా కోసం కొంతమంది హాలీవుడ్ నటులను తీసుకోబోతున్నాడట సందీప్. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో నటించిన పెద్ద పెద్ద స్థాయి ఉన్న నటులను ఈ చిత్రంలోకి తీసుకోబోతున్నారట. ఆ విధంగా సందీప్ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం గతంలో ప్రభాస్ తో నటించిన ఓ హీరోయిన్ ను ఎంపిక చేయడానికి సిద్ధమవుతున్నారట.

Also Read: Raviteja: ఆ హీరోయిన్ కారణంగా రవితేజ పూరి మధ్య గొడవలు.. శనిలా దాపురించిందంటూ..?

బుజ్జిగాడు, వర్షం వంటి సినిమాలలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన త్రిష ను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేయబోతున్నారట. వాస్తవానికి త్రిషకు ఇంత పెద్ద సినిమా అవకాశము రావడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న త్రిష కెరీర్ దాదాపు అయిపోయింది. అలాంటి సమయంలో ఆమెకు ప్రభాస్ లాంటి హీరో సరసన ఇంతటి పెద్ద స్థాయి ఉన్న సినిమా అవకాశం రావడం గొప్ప విషయమే. అయితే సందీప్ రెడ్డి ఈ విధంగా ఎందుకు ఆలోచించాడు అనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడవలసింది.