SSMB 29: Mahesh Babu and Vikram to Clash in Pan-India Film

SSMB 29: రాజమౌళి దర్శకత్వంలో నటించే సినిమా కోసం మహేష్ బాబు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన ఈ సినిమా కోసం రెడీ అవుతున్న విధానాన్ని బట్టి ఈ చిత్రం ఎంతటి స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మేకోవర్ కూడా పూర్తి భిన్నంగా ఉంది. రాజమౌళి కూడా మరికొన్ని రోజులలో ఈ సినిమాను మొదలుపెట్టబోతుండగా ఆఫ్రికన్ అడవులలో జంగిల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి కలిగిన టెక్నీషియన్లను తీసుకురాబోతున్న నేపథ్యంలో నటీనటుల విషయంలో కూడా రాజమౌళి ఏ మాత్రం తగ్గడం లేదని అంటున్నారు.

SSMB 29: Mahesh Babu and Vikram to Clash in Pan-India Film

ఎలాగూ ఇది పాన్ ఇండియా స్థాయిని దాటే సినిమా అవుతుంది కాబట్టి రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులను ఈ సినిమా ద్వారా తీసుకురాబోతున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో ప్రతి నాయకుడు పాత్రను తమిళ హీరో విక్రమ్ చేయబోతున్నాడని అంటున్నారు. దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగాయట. దీంతో మహేష్ ను ఢీకొట్టే ప్రతి నాయకుడిగా విక్రమ్ ఉండడం మహేష్ అభిమానులను ఎంతో ఆసక్తి పరుస్తుంది. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను చేసి ఇండియన్ సినిమా దశ దిశలను మార్చేసిన రాజమౌళి ఈ సినిమా ద్వారా ప్రపంచ గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అని చెప్పవచ్చు.

Also Read: Tollywood: రామ్, చిరు,విజయ్ దేవరకొండ.. ఆ డైరెక్టర్ లిస్ట్ లో ఇంతమందా!!

ఇటు మహేష్ కూడా పెద్ద హీరో కావడంతో వీరిద్దరి కలయికలో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అన్న ఆసక్తి ఇప్పటినుంచి ప్రేక్షకులలో నెలకొంది. కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. మహేష్ మేకోవార్ ఈ సినిమా కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది.