Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖుల జాతకాలు చెబుతూ  వివాదాల్లో ఇరుక్కుంటూ సెలబ్రిటీ అయ్యాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ విజయం సాధిస్తారని చెప్పారు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వేణుస్వామి ఇకపై ప్రముఖుల జాతకాలు చెప్పబోనని ప్రకటించారు. అంతకుముందు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని కూడా చెప్పారు. అయితే తాజాగా ఆయన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంటపై పలు వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇద్దరు ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా వీరిద్దరూ ఓ హీరోయిన్ వల్ల విడాకులు తీసుకుంటారని చెప్పారు. వీరిద్దరి రాశులు సరిపోవడం లేదని వేణుస్వామి తెలిపారు. చై-శోభిత కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని అయితే తన జ్యోతిష్యం తప్పు కాదని పేర్కొన్నాడు. దీంతో మళ్లీ వేణుస్వామిపై ట్రోల్స్ మొదలయ్యాయి. వారి రాశి గురించి మాట్లాడమని ఎవరు చెప్పారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Nithya Menen: పెళ్లయిన హీరో పై మోజు పడ్డ నిత్యామీనన్..?

ఈ ట్రోల్స్ తట్టుకోలేక వేణుస్వామి ఓ వీడియో పోస్ట్ చేసి నాగ చైతన్య-శోభిత ధూళిపాళల జాతకాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. “నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల జాతకం గురించి నేను గతంలో చెప్పాను కాబట్టి, దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పాను.. నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పను, కానీ నేను ఇప్పుడు ఇదొక్కటే చెప్పాను.. ఇకపై నేను ఎవరికీ చెప్పను.. అని చెప్పాడు.. ఏదేమైనా వేణు స్వామి పై అక్కినేని వారు కేసు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. దీనిపై అయన ఏవిధంగా సమాధానం చెప్తాడో చూడాలి.