Trisha Krishnan: Bagging Big Roles in Telugu Films

Trisha Krishnan: విక్టరీ వెంకటేష్ గత చిత్రం ‘సైంధవ్’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా గ్యాప్ తీసుకొని మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఇప్పుడు మరొక చిత్రాన్ని అంగీకరించడం విశేషం.

Trisha Krishnan: Bagging Big Roles in Telugu Films

‘సామజ వరగమన’ సినిమాతో రచయితగా గుర్తింపు దక్కించుకున్న నందు చెప్పిన ఓ కథకు వెంకీ ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి చిట్టూరి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఈ చిత్రం రాబోతుందట. ఈ దసరాకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తుండగా వచ్చే ఏడాది వేసవి కానుక ఈ సినిమాను విడుదల చేసే విధంగా పనులు ప్రారంభిస్తున్నారట. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Rajinikanth: రజినీకాంత్ మార్కెట్ కి బాగా దెబ్బపడిందిగా!!

ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో ఒకసారి కథ వినగానే ఈ సినిమా కోసం ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. వీరి కాంబో లో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే; సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత చేసిన ‘నమో వెంకటేశ’ చిత్రం పర్వాలేదనిపించుకుంది. అలా వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని వారి అభిమానులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కెరీర్ ను లాక్కొచ్చిన త్రిష కి ఇప్పుడు తెలుగు లో అవకాశాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే త్రిష చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కథానాయికగా నటిస్తూ ఉండగా ఈరోజు చిరు పుట్టిన రోజు సందర్భంగా ఓ అప్డేట్ కూడా వదిలింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు ఆమెకు మరొక సీనియర్ హీరో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావడం నిజంగా ఆమె కెరియర్లో మరొక ఎరా మొదలైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాలకృష్ణ, నాగార్జున సినిమాలలో కూడా ఆమె కు వరుస అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. మరి త్రిష ఈసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.