Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే సంపాదించుకుంది వైసిపి పార్టీ. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. Jagan

Jagan bumper offer to Sunil kanugolu

అదే సమయంలో తెలుగుదేశం కూటమి సర్కార్… 164 స్థానాలు సంపాదించుకోగలిగింది. వాస్తవానికి ఐప్యాక్ నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దారుణంగా విఫలమయ్యారు.2019 ఎన్నికల సమయంలో…ప్రశాంత్ కిషోర్ వైసిపి పార్టీని దగ్గరుండి గెలిపించారు. కానీ ఆయన దూరం కావడంతో వైసిపి పరిస్థితి దారుణంగా తయారైంది. Jagan

Also Read: IPL 2025: IPL 2025కి ముందు ప్రమాదంలో పడ్డ ముంబై ?

అసలు క్యాడర్ను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా పోయారు. దానివల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది వైసిపి.అయితే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ను గెలిపించిన సునీల్ కనుగోలును వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. Jagan

ఇందులో భాగంగానే బెంగళూరులోని ప్యాలస్కు సునీల్ ను రప్పించారట జగన్మోహన్ రెడ్డి. ఆయనకు వైసిపి పార్టీని పూర్తిగా అప్పగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. మళ్లీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేలా.. సునీల్ కనుగోలుకు బాధ్యతలు అప్పగించబోతున్నారట. దీనికోసం భారీగానే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారట. Jagan