Tollywood: రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కినేని నాగార్జున ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది. శనివారం ఉదయానే హైడ్రాధికారులు రంగంలోకి దిగి… అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ధ్వంసం చేశారు. చెరువుకు సంబంధించిన మూడెకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను అక్కినేని నాగార్జున నిర్మించాడని ప్రధాన ఆరోపణ. Tollywood

Conspiracies to move Tollywood industry to AP

దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు… శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ ను ధ్వంసం చేశారు. నాలుగు గంటల్లోనే… అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను… నేలమట్టం చేశారు. అయితే అక్కినేని నాగార్జున కు జరిగిన అన్యాయం పైన గులాబీ పార్టీ సపోర్ట్ గా నిలుస్తున్నట్లు సమాచారం. Tollywood

Also Read: Jagan: జగన్ పై 7 గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. బొత్స జంప్?

సోషల్ మీడియాలో… గులాబీ పార్టీ పెట్టే పోస్టులను చూస్తే మనకు అదే అర్థమవుతుంది. 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కినేని నాగార్జునకు… అప్పటి ముఖ్యమంత్రి పర్మిషన్ ఇచ్చాడని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన N కన్వెన్షన్ను… మళ్లీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని… గులాబీ పార్టీ స్పష్టం చేస్తోంది. Tollywood

అంతేకాదు… టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏపీకి తరలించేందుకు రేవంత్ రెడ్డి తో… నారా చంద్రబాబు నాయుడు ఇదంతా చేయిస్తున్నాడని కూడా గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలను ఇబ్బంది పెడితే కచ్చితంగా వాళ్ళు ఏపీకి వెళ్తారని చంద్రబాబు ఇలా కుట్రలు చేస్తున్నారని గులాబీ పార్టీ అంటోంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. Tollywood