Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత… ఆ పార్టీలో ఉన్న నేతలు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసులు… ఎన్నికల్లో జరిగిన ఘర్షణల కేసులు… ఇలా చెప్పుకుంటూ పోతే వైసిపి నేతలను టార్గెట్ చేసి మరీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం… కేసులు పెడుతోంది. Vijayasai Reddy

Setback For Vijayasai Reddy Daughter In High Court

ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఇరుక్కున్నాడు. ఇటు కొడాలి నాని కూడా గుడివాడలో ఇబ్బంది పెడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేన ఒక ఆట ఆడుకుంటుంది. అటు పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా తెలుగుదేశం తమ్ముళ్లు.. టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారు. Vijayasai Reddy

Also Read: Jagan: “తమిళ” వ్యూహంతో దూసుకెళ్తున్న జగన్.. చంద్రబాబు ప్రభుత్వం కూలుతుందా ?

ఇలా ఏపీలో ఉన్న వైసీపీ నేతలు అందరినీ టార్గెట్ చేసి మరి… కూటమి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వంతు వచ్చింది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసా రెడ్డి కుమార్తెకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె.. పెనికా నేహా రెడ్డికి… ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. Vijayasai Reddy

విశాఖలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు ఉల్లంఘించి ఆమె భీమిలి బీచ్ లో.. సముద్రానికి సమీపంలో ఒక ప్రహరీ గోడ నిర్మించారట. ఇక దీనిపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ విధితమే. ఇక దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు విచారణ చేసింది. విజయసాయిరెడ్డి కూతురు కట్టిన ప్రహరీ గోడ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఏపీ హైకోర్టు. దీంతో విజయ్ సాయి రెడ్డి కుటుంబానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. Vijayasai Reddy