NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు బీభత్సంగా కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ అలాగే ఖమ్మం నగరాలు…వరదల కారణంగా మునిగిపోయాయి. NTR

Junior NTR meeting with CM Chandrababu Naidu

దీంతో రెండు నగరాల ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు.ఆస్తి అలాగే ప్రాణనాష్టం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ అలాగే ఇతర ప్రముఖులు…తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించాయి. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ రెండు ప్రభుత్వాలకు విరాళం ప్రకటించారు. NTR

Also Read: Chandrababu: రేవంత్ బాటలో చంద్రబాబు సర్కార్… ఏపీలో కూడా హైడ్రా?

అందరి హీరోల కంటే మొదటగా ఎన్టీఆర్ స్పందించి విరాళం ప్రకటించడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ఆ చెక్కు అందించాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారట. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్… ఆయనను కలవలేదు. NTR

అందుకే ఇదే సరైన సమయం అని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట. కొంతమంది టాలీవుడ్ పెద్దలతో కలిసి చంద్రబాబు నాయుడును త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాలలో హార్ట్ టాపిక్ అయింది. NTR