Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ.. ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల..మధ్య కీలక ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలు చాలా రహస్యంగా జరిగాయట. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Jagan

Jagan Gave Lotus Pond House To Sharmila

దీంతో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి… తెలంగాణ రాష్ట్రంలో…నాన రచ్చ చేసింది. అయితే ఇక్కడ సక్సెస్ కాకపోవడంతో ఏపీకి వెళ్లి పోయిన షర్మిల… అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారింది. అయితే సరిగ్గా ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేయడం జరిగింది. Jagan

Also Read: Hydra: వైసీపీ నేత కాటసాని ఫామ్ హౌస్ కూల్చివేత…. తర్వాత జగనే టార్గెట్?

ఈ దెబ్బకు వైసిపి పార్టీకి చాలావరకు నెగిటివ్.. జరిగిందని రాజకీయ విశ్లేషకుడు చెబుతూ ఉంటారు. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు వైసిపి పార్టీ పడిపోయింది. ఇప్పటికీ అలాగే షర్మిల తో గొడవలు పెట్టుకుంటే… వైసీపీకి మరింత నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారట. Jagan

షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు అన్ని ఇచ్చేసారట జగన్. అలాగే లోటస్ పాండ్… ఇంటిని కూడా షర్మిలకు రాసిచ్చారట జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇకపై వైయస్ జగన్మోహన్ రెడ్డి పై షర్మిల కామెంట్స్ చేయకపోవచ్చు అని… వార్తలు వస్తున్నాయి. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారట. Jagan