KCR: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. వారి అనర్హతపై కేవలం నాలుగు వారాల్లోనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ లోపు నిర్ణయాలు తీసుకోలేకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని తెలియజేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ ఆదేశించాలని బీఆర్ఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. KCR

KCR Sketch 7 congress mlas into brs party

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన ధర్మస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పడం జరిగింది. హైకోర్టు తీర్పు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని తెలియజేశారు. KCR

Also Read: Jagan: షర్మిలతో రహస్య ఒప్పందం..లోటస్‌ పాండ్ రాసిచ్చేసిన జగన్‌ ?

తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడడం కచ్చితంగా జరుగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుపు తప్పకుండా జరుగుతుందని ఎక్స్ వేదికగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ తెలిపారు. అయితే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై ఎలాగైనా వేటు పడుతుందని గ్రహించిన పార్టీ మారిన మిగతా 7 గురు ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ ను కలిసేందుకు సిద్ధం అయ్యారట. ఆయన ఒకే చెబితే.. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ కానున్నారట. KCR