Kolikapudi: వైసీపీ అధినేత జగన్ దంపతులపై తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరదలు, ఏపీ పరిస్థితులపై తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాసరావు మీడియాను అడ్రస్‌ చేశారు. ఈ సందర్భంగా తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ… భారతి రాస్తున్న రాతలకు అనుగుణంగానే జగన్ కూస్తున్నాడని ఆగ్రహించారు. Kolikapudi

TDP MLA Kolikapudi Srinivasa Rao sensational comments on Jagan couple

ఇద్దరూ జీవిత భాగస్వాములా లేక వ్యాపార భాగస్వాములా అనే అనుమానం కలుగుతోందని బాంబ్‌ పేల్చారు తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాసరావు. పులివెందులలో జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన సోదరుడు అభిషేక్ రెడ్డి ప్రాణాపాయంలో ఉంటే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని మండిపడ్డారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న అభిషేక్ రెడ్డిని జగన్, భారతీ కనీసం పరామర్శించ లేదని తెలిపారు. Kolikapudi

Also Read: Jagan: షర్మిలతో రహస్య ఒప్పందం..లోటస్‌ పాండ్ రాసిచ్చేసిన జగన్‌ ?

వారికున్న మానవత్వం ఏంటో ఇక్కడే తేలిపోయిందన్నారు. అభిషేక్ రెడ్డిని పరామర్శించే దగ్గర చంద్రబాబుని తిట్టే అవకాశం లేదు కాబట్టి పలకరించడానికి కూడా జగన్ వెళ్లలేదని ఆగ్రహించారు. నేరస్తుల్ని పరామర్శించటం వైఎస్ కుటుంబ సంప్రదాయమన్నారు.

వ్యక్తిగత అజెండాతో నందిగంను పరామర్శించిన జగన్ మొక్కుబడిగా వరద బాధితుల్ని పరామర్శించాడని తెలిపారు. పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టే నందిగంను జగన్ పరామర్శించాడని… ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని తిట్టేందుకు నందిగం సురేష్, వరద బాధితుల పరామర్శలను జగన్ వేదికగా చేసుకున్నాడని తెలిపారు. Kolikapudi