KCR: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అలాగే హుజురాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ కాస్త తెలంగాణ వర్సెస్ ఆంధ్ర రాష్ట్రాల మధ్య జరిగినట్లుగా మీడియా కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే వాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఆంధ్రావాలా కాళ్లకు ముల్లు దిగితే…. కెసిఆర్ పంటితో తీస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. KCR

Gandhi and Kaushik Panchayat KCR favorite sketch

అందుకే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి… ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసిఆర్ క్షమాపణలు చెప్పాలని.. కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ వేసి… కౌశిక్ రెడ్డి తో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కరీంనగర్ వాసి… అయి ఉండి హైదరాబాద్ ఎందుకు వచ్చావు అని గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. KCR

Also Read: Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ దాడి.. అసలు రాజకీయం ఇదే?

అందుకే నేను పర్సనల్గా గాంధీని ఏపీ వ్యక్తి అని.. తిట్టినట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాదులో ఉన్న సెటిలర్లను.. తాము ఏమీ అనలేదని.. 10 సంవత్సరాలుగా ఉంటున్న సెటిలర్లు ఇప్పుడు కూడా అదే విధంగా హాయిగా ఉండాలని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇక కౌశిక్ రెడ్డి… చేసిన వ్యాఖ్యలతో ఈ పంచాయతీ తెగినట్లే అనిపిస్తోంది. ఇదంతా కేసీఆర్ వెనుక ఉండి నడిపించినట్లు సమాచారం. KCR