Sridevi: ఏంటి దివంగత నటి శ్రీదేవికి ఆ హీరోయిన్స్ అంటే కుళ్లా..వారి మీద కుళ్ళు తో చివరికి అలా చేసిందా.. మరి ఇంతకీ శ్రీదేవి ఎవరిపై కుళ్లు పెంచుకుంది. ఎవరంటే శ్రీదేవి అసహ్యించుకునేది అనేది ఇప్పుడు చూద్దాం. దివంగత నటి శ్రీదేవి చనిపోవడానికి కారణం ఆమె కఠినమైన డైట్ అని బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె తన బాడీ షేప్ ని అలాగే కొనసాగించడం కోసం అవకాశాల కోసమే చాలా కఠినంగా ఉండే డైట్ పాటించేదట.
What did Sridevi do that day
ఈ కారణంతోనే అప్పుడప్పుడు బీపీ డౌన్ అయిపోయేదట.. అలా ఆరోజు దుబాయ్ కి వెళ్ళిన సమయంలో కూడా స్నానం చేయడానికి బాత్ టబ్ లో దిగి స్పృహ కోల్పోయి అందులోనే పడడంతో ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే..నటి శ్రీదేవి గురించి నటుడు, రచయిత అయినటువంటి తోటపల్లి మధు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. (Sridevi)
Also Read: Samyuktha Menon: విడాకులు తీసుకున్న హీరోపై మోజు పడుతున్న సంయుక్త మీనన్.?
శ్రీదేవి అందం కోసం ఎంతవరకైనా వెళ్ళేది. ఒక దశలో శ్రీదేవి కంటే ఐశ్వర్యరాయ్,కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లకు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని కఠినమైన డైట్ ని పాటించింది. దాంతో ఆమె అన్ని వ్యాధుల బారిన పడింది.అలా హై బీపీ, హై డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చాయి.
అలాగే ఆమె కంటే మరొకరికి ఎక్కువ అవకాశాలు వస్తే అస్సలు తట్టుకునేది కాదు. నాలో ఏం తక్కువ ఉంది అని ప్రతిసారి ఆలోచించి మరింత యంగ్ గా కనిపించడం కోసం తాపత్రయపడేది. అలా ఆమె అందం కోసం చేసిన పనులే చివరికి ప్రాణం మీదకి తీసుకువచ్చాయి అంటూ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేశారు తోటపల్లి మధు.(Sridevi)