Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత… వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీని వరుసగా నేతలు వీడుతున్నారు. కూటమి పార్టీల వైపు తొంగి చూస్తున్నారు వైసిపి నేతలు. దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా వైసిపి నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతోంది. Chandrababu

chandrababu naidu comments on tirumala laddu

అలాగే వైసిపి నేతల పై ఆరోపణలు కూడా చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో… జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని ఆగ్రహించారు. Chandrababu

Also Read: Jamili Elections: మోడీ బిగ్ స్కెచ్.. కూలనున్న చంద్రబాబు ప్రభుత్వం?

లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారని కూడా మండిపడ్డారు. లడ్డు ప్రసాదాలలో నెయ్యి వాడాల్సింది జంతువుల నూనె వాడారని… సంచలన ఆరోపణలు తెరపైకి తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… మంచి శ్రేష్టమైన నెయ్యి వాడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. Chandrababu