Bandi Sanjay: తెలంగాణ పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి బండి సంజయ్ గురించి తెలియని వారు ఉండరు. అయితే బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం పార్టీ అయిన మజిలీస్ పైన తాజాగా… హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఓవైసీ కి సంబంధించిన కాలేజీలో ఉగ్రవాదులు ఉన్నారని బాంబు పేల్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కుమార్… ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. Bandi Sanjay

Bandi Sanjay Comments On MIM

బీజేపీ కి ఇస్లాం ఫోబియో ఉందని ఓవైసీ అంటున్నారని..మీకు కూడా హిందూ ఫోబియో ఉందని వ్యాఖ్యానించారు. ఓవైసీ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని కూడా పేర్కొన్నారు. తిరుపతి లడ్డు పవిత్రమైనదని వెల్లడించారు. ప్రపంచంలో తిరుపతి లడ్డు అంటే ప్రాముఖ్యత ఉందన్నారు. ఇది దుర్మార్గపు చర్య అని ఆగ్రహించారు. తిరుపతి లడ్డు ప్రాదాన్యత పెరగడం వలనే కుట్ర జరిగిందని పేర్కొన్నారు. Bandi Sanjay

Alsi Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!

తిరుపతి లడ్డుపై కేంద్రం విచారణ చేస్తుందని వివరించారు. చంద్రబాబు, ఎన్డీయే ప్రభుత్వం పై ప్రజలకి మంచి నమ్మకం ఉందన్నారు. తిరుపతి ‌లడ్డు పవిత్రత చెడగొడితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల దేవాలయాలలో హిందువులే ఉండాలని వెల్లడించారు. ఇది హిందు ధర్మం పై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. Bandi Sanjay