That date is very sentimental for these four Celebrities

Celebrities: ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అయితే అది మామూలు జనాలకే కాదు సెలబ్రిటీలకు,రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఈ నలుగురు సెలబ్రిటీలకు కూడా ఆ డేట్ చాలా ప్రత్యేకమైనదట.మరి ఎందుకు ఆ డేట్ అంత ప్రత్యేకం..ఇంతకీ ఆ నలుగురు సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. నాగార్జున, వెంకటేష్,చిరంజీవి,కీర్తి సురేష్ ఈ నలుగురు సెలబ్రిటీలకు మే 9 అంటే ఎంతో ప్రత్యేకమైనదట.

That date is very sentimental for these four Celebrities

మే 9తో వీళ్ళకి ఉన్న విడదీయలేని అనుబంధం ఏంటయ్యా అంటే.. కీర్తి సురేష్ హీరోయిన్గా సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీ అందరూ చూసే ఉంటారు.అయితే ఈ సినిమా 2018 మే 9 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక కీర్తి సురేష్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు.ఇక మరో హీరో అక్కినేని నాగార్జున కి కూడా మే 9 చాలా సెంటిమెంట్.(Celebrities)

Also Read: Justice Hema Committee: మొన్న జానీ మాస్టర్..నిన్న హర్ష సాయి..నేడు మరో నటుడు.. అత్యాచారం కేసులో జైలుకి!!

ఎందుకంటే నాగార్జున నటించిన సంతోషం మూవీ కూడా 2002 మే 9న విడుదలైంది.ఈ సినిమా నాగార్జున కెరియర్ లో అప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలోకేల్లా బెస్ట్ గా నిలిచింది. అందుకే మే 9 నాగార్జునకి కూడా కలిసి వచ్చిన రోజు.ఇక మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా 1990 మే 9 న విడుదలైంది.

That date is very sentimental for these four Celebrities

అయితే ఈ మూవీ విడుదలయ్యాక మూడు రోజులపాటు తుఫాన్ కారణంగా సినిమాని ఎవరు ఆదరించలేదు. కానీ మూడు రోజుల తర్వాతే అసలైన జాతర షురువైంది. థియేటర్లకు జనాలు పోటెత్తారు. అలా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది.అలాగే వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమా కూడా 1997 మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.అలా ఈ నలుగురు సెలబ్రిటీలకు మే 9అనేది ఒక ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది.(Celebrities)