Bjp Mla Raja singh: జగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తామని హిందువులు తిరుగుతున్నారని రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు గురించి చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎవరిని కదిలించినా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన చర్చించుకుంటున్నారు. Bjp Mla Raja singh

Bjp Mla Raja singh Comments On Ys Jagan

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడాలని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో…ఈ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల దేవస్థానం ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. దేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. Bjp Mla Raja singh

Also Read: Kodali Nani: తిరుమలలో చంద్రబాబుకు గుండు కొట్టించనున్న కొడాలి నాని?

తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి కలిపారని జరుగుతున్న ప్రచారం భక్తుల మనోభావాలకు భాధ కలిగిస్తున్నాయని రాజాసింగ్ పేర్కొనడం జరిగింది.జగన్ కు తిరుమల దర్శనం చేసుకునేందుకు అర్హత ఉందా..? అని ప్రశ్నించారు రాజాసింగ్. ఘోర పాపం చేశాక ధర్షనం కు వెళ్ళడానికి జగన్ కు సిగ్గులేదా..? అంటూ ఫైర్ అయ్యారు రాజాసింగ్. దేవుడిపై నమ్మకం లేకుంటే ఎందుకు దర్శనానికి వెళ్తున్నారు, ఎందుకు రాజకీయం చేస్తున్నారు..తెలుగు సమాజమంతా జగన్ ను తిట్టుకుంటున్నారన్నారు. దొరికితే చంపెద్దమన్న కసితో తెలుగు వారు ఉన్నారని బాంబు పేల్చారు. హిందూ బోర్డు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం మంచి పరిణామం…పవన్ కళ్యాణ్ మాటలకు మద్దతు తెలుపుతున్నామన్నారు. Bjp Mla Raja singh