భర్తకు నరకం చూపించిన నటి

Madhuri Dixit: భూల్ భులయ్య 3 చిత్రంతో మళ్ళీ తెరపైకి వస్తున్న మాధురి దీక్షిత్, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తన భర్త కోసం రొయ్యల కూర వండిన అనుభవాలను పంచుకున్న ఆమె వీడియో వైరల్‌గా మారింది.

Madhuri Dixit Talks About Cooking for Her Husband

ఓ టాక్ షోలో మాట్లాడుతూ, రొయ్యలు వండడం ఎంత కష్టమో, తన భర్త వాటిని ఎంత ఓర్పుతో తిన్నాడో ఆమె ఆసక్తికరంగా వివరించారు. “మహిళలు ఎన్నో పనులు చేస్తారు కదా, భార్య, అమ్మ, ఉద్యోగి, వంటవాడు అని. రొయ్యలు 15 నిమిషాలు ఉడికించినా రబ్బరులాగే అయిపోయాయి. నా భర్త వాటిని చాలా నమిలి తిన్నాడు. నన్ను ప్రోత్సహించడానికి అలా చేశాడు” అని ఆమె చెప్పారు.

Also Read: Ram Charan Wishes NTR: రామ్ చరణ్ దేవర విషెష్ కొరటాల కు లేదా.. మంట ఇంకా చల్లారలేదా!!

మాధురి దీక్షిత్ 1999లో డాక్టర్ శ్రీరామ్ నేనేని ని వివాహం చేసుకున్నారు. అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు వారికి. 2011లో కుటుంబంతో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. మాధురి దీక్షిత్ కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు, గొప్ప భార్య, అమ్మ కూడా. తన వ్యక్తిగత జీవితం గురించి తెరవడం ద్వారా ఆమె మరింత మనసుకు చేరువైనారు. భర్త కోసం వండిన కూర గురించి ఆమె పంచుకున్న అనుభవం, ప్రతి మహిళా ప్రేక్షకురాలికి స్ఫూర్తినిస్తుంది.

వీరి పెళ్ళికి ముంబైలో జరిగిన రిసెప్షన్‌కి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, బాల్ థాకరే, దిలీప్ కుమార్, శ్రీదేవి వంటి ప్రముఖులు హాజరయ్యారు. నంతరం వారు దశాబ్దంపాటు డెన్వర్‌లో నివసించారు. మార్చి 2003లో పెద్ద కుమారుడు అరిన్ పుట్టగా, 2005 మార్చిలో రెండో కుమారుడు ర్యాన్ పుట్టాడు. 2011లో కుటుంబంతో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు.