Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో, అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యం పెట్టడంపై నిషేధం విధించడంపై ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వివరించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారైన ప్రసాదాలనే స్వామికి నైవేద్యం అందించాలని, భక్తులకు కూడా అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Tirumala Laddu Controversy: Ayodhya Ram Mandir Authorities

దేశంలో అన్ని ఆలయాల్లో బయటి వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని సూచించారు. తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలో జరగాలని కోరారు. ఈ నిర్ణయంతో, కేవలం పూజారులు తయారుచేసిన ప్రసాదాలను మాత్రమే దేవుళ్లకు సమర్పించాలని డిమాండ్ చేశారు.

Also Read: Health Cards: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికి ఆ లబ్దీ!!

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు మరియు సాధు సన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సత్యేంద్ర దాస్ అన్నారు. ఈ వివాదం భక్తులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

మరువురి నాణ్యత ప్రమాణాలను అంచనా వేసేందుకు, మార్కెట్లో అమ్ముతున్న నూనె మరియు నెయ్యి నాణ్యతను తేల్చాలనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు భక్తుల విశ్వసనీయతను పునరుద్ధరించడానికి అవసరమని ఆయన అభిప్రాయించారు.