Vijayasa Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో… వైసిపి వర్సెస్ తెలుగుదేశం మధ్య… వార్ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది నేతలు బయటకు వెళ్లారు. Vijayasa Reddy

Vijayasai Reddy to Join in TDP

మరి కొంతమంది వైసీపీ నేతలు… జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేలా కనిపిస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని అలాగే దొరబాబు లాంటి.. కీలక వైసిపి నేలు జారుకున్నారు. అటు రాజ్యసభ సభ్యులు కూడా ఒక్కొక్కరు రాజీనామా పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న… విజయసాయిరెడ్డి కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారట. టిడిపి మంత్రి అచ్చం నాయుడు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. Vijayasa Reddy

Also Read: Rohit Sharma: రెండో టెస్టులో రాక్షసుడ్ని దింపుతున్న రోహిత్..బంగ్లాకు ఇక చుక్కలే !

మళ్లీ రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి టిడిపిలోకి వస్తారని ఆయన బాంబు పేల్చారు. దానికోసమే విజయ్ సాయి రెడ్డి… టిడిపి నేతలతో మంతనాలు జరుపుతున్నారని కూడా తెలిపారు. అయితే ఈ వార్త బయటకు రావడంతో.. వైసీపీలో కొత్త అలజడి నెలకొంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి తో ఉన్న విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై విజయ్ సాయి రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తే… బాగుంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.