Vishwambhara: తెలుగు సినీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగంటే ప్రత్యేకమైన ఉత్సాహం. ఈ సీజన్‌లో స్టార్ హీరోలు తమ కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు. సంక్రాంతి విడుదలలు సాధారణంగా పెద్ద విజయాలను నమోదు చేస్తాయి కాబట్టి, ఈ సమరంలో ప్రతి సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా ఈ రేసులో ఉండనుందని అందరూ భావించారు.

Chiranjeevi Vishwambhara Release Pushed

చిత్ర నిర్మాతలు మొదట సంక్రాంతి పర్వదినం జానవరి 10న ‘విశ్వంభర’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఈ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడమే. మరోవైపు, ఓటీటీ హక్కుల అమ్మకం కూడా ఇంకా సక్రమంగా పూర్తికాకపోవడం కూడా ఆలస్యం చేస్తున్న అంశాలలో ఒకటి.

Also Read: Butter Milk: రోజూ 1 గ్లాసు మజ్జిగ తాగడం వల్ల 100 రోగాలకు దూరంగా ఉండొచ్చు?

‘విశ్వంభర’ సినిమా సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతుండటంతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ కీలకంగా మారాయి. చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణన్‌, ఆషికా రంగనాథన్‌ నటిస్తుండగా, కునాల్‌ కపూర్‌, రమ్య పసుపులేటి, ఈష చావ్లా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయిన తర్వాత, ఓటీటీ డీల్ సరిగా కుదిరినప్పుడే నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ‘విశ్వంభర’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిరంజీవి అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు.