Hyderabad Metro Stations: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రయాణించే వారికి ఒక వార్త. నాగోల్ మరియు మియాపూర్ మెట్రో స్టేషన్లలో వాహనాలను ఉచితంగా పార్క్ చేయడం ఉచితం కాదట. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ స్టేషన్లలో వాహనాలను పార్క్ చేయాలంటే ప్రయాణికులు ప్రత్యేకంగా నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

No More Free Parking at Hyderabad Metro Stations

ఈ నిర్ణయంతో మెట్రో సేవలను ఉపయోగించే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు ఉచితంగా లభించిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్న వారు ఇకపై చెల్లించాల్సి వస్తుందనే వార్త ప్రజలను ఆందోళనకు గురి చేసింది. ఈ మార్పు ప్రయాణికులపై ఆర్థికంగా పెనుభారం మోపుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Also Read: Chandrababu Naidu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్!!

మెట్రో అధికారులు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఇంకా వివరించలేదు. అయితే, పార్కింగ్ స్థలాల నిర్వహణ ఖర్చులు మరియు మెరుగైన సేవల కోసం ఈ ఫీజును వసూలు చేయవచ్చని తెలుస్తోంది.

ప్రజల నుంచి ఈ నిర్ణయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని సమర్థిస్తూ మెట్రో సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని అంటుండగా, మరికొంతమంది ఇప్పటికే ఉన్న భారం మీద మరింత ఆర్థిక ఒత్తిడి వస్తుందని విమర్శిస్తున్నారు.