Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్యాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ తన సినిమా కోసం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవడంతో, చిత్ర బృందం కొత్త టైటిల్ కోసం పరిశీలనలో ఉంది.

Jr NTR Epic Film with Prashanth Neel Updates

హీరోయిన్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘సప్తసాగరాలు’ ఫేమ్ రుక్మిణి వసంత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోయిన్లకు కీలక పాత్రలు ఉండటం సహజం. రుక్మిణి తన నటనతో ఆకట్టుకోవడంతో ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో, రష్మిక మందన్న పేరు కూడా పరిశీలనలో ఉంది.

Also Read: Bobby Deol: వామ్మో.. బాబీ డియోల్ కి ఆఫర్ ల జాతర.. యానిమల్ మహిమ!!

ఈ సినిమా కథ బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగేలా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ ఇందులో ప్రవాస భారతీయులను రక్షించే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సాధారణంగా తన సినిమాల్లో బ్లాక్ టోన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ఈ సినిమాలో కొత్త నేపథ్యం, కొత్త కథాంశం కారణంగా, ఆయన దృశ్యపరంగా కొత్త ప్రయోగాలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి, సెట్స్ మరియు లొకేషన్ల ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రీకరణ పూర్తి చేసితర్వాత ఈ సినిమాలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు, దీని అంచనాలు ఎన్టీఆర్ ‘దేవర’కు వచ్చిన స్పందనతో మరింతగా పెరుగుతున్నాయి.