Pawan Kalyan Signs Declaration Before Tirumala Darshan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలినడక మార్గంలో మంగళవారం రాత్రి ఏడుకొండలపైకి చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ముందు పవన్, తన కూతుళ్లు ఆద్యా మరియు పలీనా అంజనితో కలిసి డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. తండ్రి పవన్‌తో కలిసి కూతుళ్లు కూడా సంతకాలు చేయడం విశేషం.

Pawan Kalyan Signs Declaration Before Tirumala Darshan

ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మతంపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ డిక్లరేషన్ చర్చనీయాంశమైంది. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది పూర్తిగా కుటుంబ పర్యటన మాత్రమేనని, రాజకీయాలకు సంబంధం లేదని వాదిస్తున్నారు.

Also Read: KTR: పేదల ఇళ్లు కూల్చివేతపై కేటీఆర్ ఆగ్రహం..గాంధీ ఆదర్శాలు కాంగ్రెస్‌కు గుర్తుచేయాల్సిన సమయం!!

తిరుమల యాత్రలో పవన్ తన కుటుంబంతో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, చిన్న కూతురు పలీనా అంజనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఆమె ఎంతో పెద్దదైందని, తన తండ్రిని ఎంతగా ప్రేమిస్తుందో ప్రశంసిస్తున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం, పవన్ కళ్యాణ్ తిరుమలలో అన్నప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తు నుంచి అభిప్రాయాలు తీసుకుని, వారితో కలిసి అన్నప్రసాదం స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తిరుమలకు రావడం పవన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం.