Eatala Rajendar: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి.. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇద్దరం సెక్యురిటీ లేకుండా మూసీ పరివాహ ప్రాంతానికి వెళ్దామని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మూసీ పరివాహ ప్రాంత ప్రజలు నిన్ను శభాష్ అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ముక్కు నేలకురాసి క్షమాపణ చెబుతానని వెల్లడించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. Eatala Rajendar

Eatala Rajender Comments on Cm revanth reddy

ప్రజల చేత ఇంతగా తిట్టించుకున్న నాయకుడు ఎవరు లేరని తెలిపారు. గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారని వెల్లడించారు. కడుపుమండి మాట్లాడిన పేదలను 5 వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్ కు అధికారం నెత్తికెక్కిందని ఆగ్రహించారు.
మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ ? అని ప్రశ్నించారు. నమామి గంగాకు 2 వేల 500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20 వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. Eatala Rajendar

Also Read: Nagarjuna: నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నాగార్జున.. కొండా సురేఖ పై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా!!

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారని… ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్న రేవంత్ లక్ష యాభై వేల కోట్లు ఎక్కడనుండి తెస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూడా గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని…రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. Eatala Rajendar