Konda Surekha: తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మొదట కేటీఆర్‌ ను టార్గెట్‌ చేసిన మంత్రి కొండా సురేఖ…ఇప్పుడు కేసీఆర్‌ ను టార్గెట్‌ చేశారు. గజ్వేల్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… కేసీఆర్ కనపడట్లేదని పేర్కొన్నారు. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని మాకు అనుమానంగా ఉందని కూడా బాంబ్‌ పేల్చారు మంత్రి కొండా సురేఖ. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆగ్రహించారు. Konda Surekha

Konda Surekha Comments On KTR and KCR

సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని మాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ. పదవి కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతుందని వివరించారు. కేటీఆర్ సీఎం అనుకుని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ. BRS ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని ఫైర్‌ అయ్యారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గరపెట్టుకో అంటూ హెచ్చరించారు. Konda Surekha

Also Read: KTR: కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా సమస్యలు, అవ్యవస్థలు.. కేటీఆర్ తీవ్ర ఆందోళన!!

బడ్జెట్ రోజు వచ్చి మళ్ళీ కేసీఆర్ కనపడకుండా పోయాడని తెలిపారు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదని… గజ్వేల్ లో కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్2 లో ఫిర్యాదు చేస్తామని వివరించారు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ. ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల్లో BJP, BRS మధ్య చీకటి ఒప్పందం జరిగిందని.. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని BRS పార్టీ నుంచి BJPకి క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలిపారు. Konda Surekha