Rajendra Prasad daughter who passed away due to a heart attack

Rajendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో రాజేంద్ర ప్రసాద్ ముందుంటారు.. ఎన్నో కామెడీ సినిమాల్లో నటించి నట కిరీటిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది.ఆయన కూతురు మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నటుడు రాజేంద్రప్రసాద్ కి ఒక కూతురితో పాటు ఓ కొడుకు కూడా ఉన్నాడు.

Rajendra Prasad daughter who passed away due to a heart attack

కానీ కూతురి గురించి గతంలో ఓ సినీ ఈవెంట్లో సంచలన కామెంట్లు చేశారు రాజేంద్రప్రసాద్.చాలామంది అబ్బాయిలకు తల్లి లేకపోతే వాళ్లు తమ తల్లిని తమకి పుట్టిన కూతుర్లలో చూసుకుంటారు. నేను కూడా అలాగే చూసుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్.నా పదేళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. మా అమ్మని నా కూతుర్లో చూసుకున్నాను. (Rajendra Prasad)

Also Read: Amala: అమల దెబ్బకు దిగివచ్చిన కాంగ్రెస్?

కానీ నా కూతురు నన్ను మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ప్రస్తుతం నా కూతురితో నాకు మాటలు లేవు. ఆమెతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు అప్పట్లో మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి చిన్న వయసులోనే తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది.

Rajendra Prasad daughter who passed away due to a heart attack

గాయత్రి వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. నిన్న రాత్రి గుండెలో నొప్పి రావడంతో కుటుంసభ్యులు హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్ కి తరలించినప్పటికీ గాయత్రి ప్రాణాలతో బయటపడలేదు. ఇక ఈమె మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది.ఈ మరణ వార్త విని రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రికి ఒక బాబు పాప ఉన్నారు.(Rajendra Prasad)