Devara: కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్ అద్భుత నటన, జాన్వీ కపూర్ అందం, సైఫ్ అలీ ఖాన్ విలనిజం ఇలా ఎన్నో అంశాలు కలగలిసిన “దేవర” సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మొదటి రోజే రూ.172 కోట్ల భారీ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక తొలిరోజు కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా చరిత్ర పుటల్లోకి చేరింది. అయితే, ఈ దుమ్మురేపిన ఓపెనింగ్ తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Director Koratala Shiva on NTR Devara

సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేసినప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి భారీగా తరలిరావడంతో భద్రతా కారణాల వల్ల ఈ ఈవెంట్ రద్దు అయ్యింది. అభిమానుల ఉత్సాహాన్ని, అంచనాలను చూసి, సినిమా విజయవంతమైన తర్వాత గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. కానీ, ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో చిన్న కార్యక్రమంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీని వల్ల సినిమా ప్రమోషన్ పరంగా నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Renu Desai: అలాంటి వారికి నరకంలో కూడా చోటుండదు.. రేణుదేశాయ్ ఆగ్రహం!!

సినిమాపై మళ్ళీ ఉత్సాహం పెంచేందుకు కొరటాల శివ మరియు ఎన్టీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో, సుమా యాంకర్‌గా వ్యవహరించిన ఓ ఇంటర్వ్యూలో దేవర సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సినిమా ప్రారంభంలో సముద్రంలో కనిపించే స్కెలిటన్స్ గురించి ప్రశ్న అడిగినప్పుడు, కొరటాల శివ “సినిమాలోని ఇద్దరు ముఖ్య పాత్రల్లో ఒకరిది” అని సమాధానమిచ్చారు.

దీంతో అభిమానులు ఆ స్కెలిటన్ యతి పాత్రదే అయ్యుంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. యతి పాత్రను బాబీ డియోల్ పోషించనున్నారని కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. సీక్వెల్‌లో ఈ మిస్టరీ వెలుగులోకి వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ మాత్రం సస్పెన్స్‌ను కాపాడుతూ ఎక్కువ వివరాలు చెప్పలేదు. మొత్తానికి, “దేవర” సినిమా సృష్టించిన సెన్సేషన్‌తో సీక్వెల్ పై అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి.