Rukmini Vasanth: రుక్మిణి వసంత… ఈ పేరు ఇప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కన్నడ చిత్రం “సప్త సాగరాలు దాటి” లో సహజ నటనతో అందరి మనసు దోచుకున్న ఈ టాలెంటెడ్ నటి, ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమాలో ఆమె కూడా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.

Rukmini Vasanth Set for Tollywood Debut with Nikhil

ఈ చిత్రానికి “స్వామి రారా” ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిఖిల్, రుక్మిణిల మధ్య కనిపిస్తున్న కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో వారు స్కూటర్ పై వెళ్తూ ఉన్న సన్నివేశం, వెనుక రంగురంగుల రంగవల్లులు వారిద్దరి మధ్య అనుభూతిని ప్రతిబింబిస్తున్నాయి. “మజిలీ” ఫేమ్ దివ్యాంశ కౌశిక్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ముగ్గురు ప్రధాన పాత్రధారుల మధ్య ఆసక్తికరమైన కథాంశం ఉండబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Also Read: Ravi Teja: హిట్లు.. ఫ్లాప్ లు కాదు.. రవితేజ కి సినిమా చేయడమే ముఖ్యం!!

ఈ సినిమా షూటింగ్ చాలా సీక్రెట్‌గా పూర్తి కావడం విశేషం. దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ తగ్గివేసినప్పటికీ, రుక్మిణి తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలనే ఆసక్తి పెరుగుతోంది. ఆమె గురించి సోషల్ మీడియాలో కూడా చర్చలు హోరెత్తుతున్నాయి.

మొత్తానికి, “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” రుక్మిణి వసంతకు టాలీవుడ్ లో మంచి లాంచింగ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతమైతే, రుక్మిణికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు విస్తరించవచ్చు.