gopichand vishwam movie

Vishwam: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న “విశ్వం” సినిమా అక్టోబర్ 11, 2024న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం గోపీచంద్ స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తుండటమే. వైట్ల తనదైన కామెడీ టైమింగ్‌ తో సినిమా చేసి హిట్ కొడతాడు, అలాంటి డైరెక్టర్ గోపీచంద్‌ను ఎలా చూపించబోతారో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Gopichand Vishwam Generates High Expectations

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీక్వెన్సులు, గోపీచంద్ లుక్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కావ్య తాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 35 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమాలో సస్పెన్స్ యాంగిల్ కూడా ఉన్నట్టు సమాచారం, అయితే దాన్ని ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. కథలో కీలక మలుపును సూచించే కొన్ని సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా, ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “విశ్వం” గోపీచంద్‌కు మరో విజయాన్ని తెస్తుందా? శ్రీను వైట్ల మళ్లీ తన మార్క్ చూపించగలరా? ఈ సస్పెన్స్ ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే!