Naga Chaitanya 'Thandel' Set for Sankranti 2025 Release

Thandel: నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘తండేల్’ పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి 2025 కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Naga Chaitanya ‘Thandel’ Set for Sankranti 2025 Release

ఇప్పటికే గేమ్ ఛేంజర్, NBK 109, వెంకీ అనిల్ 3, మజాకా, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భారీ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్న నేపథ్యంలో ‘తండేల్’ కూడా ఆ పోటీలో నిలవడం విశేషం. ఈ నిర్ణయం నిర్మాతలకు ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. కార్తికేయ 2 వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చందూ మొండేటి ‘తండేల్’తో మళ్లీ విజయం సాధించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Also Read: Nara Rohith: ఆ హీరోయిన్ తో డేటింగ్.. పెళ్లి వరకు వెళ్లిన నారా రోహిత్.. కానీ చివరికి.?

‘తండేల్’ నాగ చైతన్య కెరీర్‌లో కీలక మలుపుగా ఉండబోతుందని భావిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సాయి పల్లవి కూడా కొత్తగా, భిన్నంగా కనిపించనుందని, ఇద్దరి కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా ఉంటుందని సమాచారం.

బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.