Vijayashanthi: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో.. మెజారిటీ స్థానాలు దక్కించుకొని ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు… అవకాశాన్ని ఇచ్చారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరువు దక్కేలా ఎనిమిది సీట్లు… ఇచ్చారు తెలంగాణ ఓటర్లు. Vijayashanthi

Vijayashanthi warns chandrababu and revanth reddy kcr game

అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారయ్యేందుకు… గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను… కాంగ్రెస్ లాగేసుకుంటుంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలను అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలను… కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు… మళ్లీ పుంజుకునేలా కనిపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల.. సమస్యల పేరుతో రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశమయ్యారు. Vijayashanthi

Also Read: Kodali Nani: జగన్ కు మరో ఎదురుదెబ్బ…కొడాలి నాని సంచలన నిర్ణయం ?

అనంతరం తెలంగాణ టీడీపీని మళ్లీ లేపుతానని చంద్రబాబు ప్రకటించడం ఇప్పుడు వివాదంగా మారింది. దీంతో తెలంగాణ వాదులు… మళ్లీ తెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ నికార్సైన ఉద్యమ నాయకురాలు విజయశాంతి… సంచలన పోస్ట్ కూడా పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పేరుతో చంద్రబాబు ఇక్కడ అడుగు పెట్టడం దారుణమని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు సపోర్ట్ ఇస్తున్న… రేవంత్ రెడ్డికి కూడా ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేశారు విజయశాంతి. Vijayashanthi

మళ్లీ ఆంధ్ర వారి కుట్రలు తెలంగాణలో అస్సలు నడవవని… ఒకవేళ చంద్రబాబు తన పార్టీని ఇక్కడ విస్తరించాలని చూస్తే.. తెలంగాణలో మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు విజయశాంతి. ఏపీ తరహాలో… బిజెపి జనసేన టిడిపి.. తెలంగాణలో పోటీ చేయాలని చూస్తే కూడా.. తెలంగాణ వాదులు ఒకటై వారిని తరిమి కొడతారని హెచ్చరించారు. అటు రేవంత్ రెడ్డికి కూడా.. ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించారు విజయశాంతి. ఇక విజయశాంతి ఈ పోస్ట్ పెట్టడంతో… ఆమె త్వరలోనే గులాబీ పార్టీలో చేరబోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. Vijayashanthi