Priyanka Chopra: గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా మూడేళ్ల కిందట అమెరికాలో ఓ రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి ఆమె సోనా అనే పేరును కూడా పెట్టింది. ఇక ఇప్పుడు మూడేళ్ల అనంతరం ఈ న్యూయార్క్ బెస్ట్ రెస్టారెంట్ ను మూసయ్యబోతుంది. దీనికి సంబంధించి టీం అధికారిక ప్రకటనను కూడా షేర్ చేసింది.

interesting news about Priyanka Chopra

జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వండిస్తామని ప్రకటించింది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. భారతీయ వంటకాలు ఆధునిక హంగులతో ఇక్కడ వడ్డిస్తారు. ఈ మూడేళ్లలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా రెస్టారెంట్ లో తిని ఆనందించారు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు నటి స్వయంగా పూజలు చేయగా ఆమె భర్త నిక్ జోనాస్ కూడా వాటిలో పాల్గొన్నారు.

Also Read: Diljit Dosanjh: కల్కి సింగర్ చేతికున్న డైమండ్ వాచ్ తో లగ్జరీ ఇల్లు కొనచ్చు.. ధర ఎంతంటే.?

ఒక సంవత్సరం క్రితం ప్రియాంక చోప్రా రెస్టారెంట్ నుంచి తన వాటా ఉపస్థాహకరించుకుంది. తన వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యల కారణంగా ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు నటి వెనక్కి తగ్గడంతో సోనా టీం ఈ రెస్టారెంట్ ను మూసివేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ను కూడా షేర్ చేసింది.

interesting news about Priyanka Chopra

అయితే దీని మూసివేత వెనుక కారణం ఇంకా తెలియలేదు. రెస్టారెంట్ బృందం జూన్ 19న సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ” మూడే ళ్ల అందమైన ప్రయాణం తర్వాత సోనా ఇప్పుడు ఆగిపోతుంది. మీకు సేవ చేసే అవకాశం మాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు బ్యాడ్ న్యూస్. చివరి బ్రంచ్ జూన్ 30న అందించబడుతుంది ” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Priyanka Chopra)