BiggBoss 8: తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రియాల్టీ షో కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు లో బిగ్ బాస్ షో 7వ సీజన్ పూర్తి చేసుకుని ఇప్పుడు 8వ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. సీజన్ 7 ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవగా ఆ సీజన్ లో కాంటెస్ట్టెంట్ ల మధ్య  ఫైట్లు, అరుపులు మరియు ఏడుపులు అవన్నీ ప్రేక్షకులపై లోతైన ముద్ర వేసాయి. అయితే ఫైనల్ రోజు మాత్రం నెక్స్ట్ లెవెల్లో రచ్చ జరిగింది.

Couple entry into Bigg Boss 8 new season

పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట భారీ విధ్వంసం సృష్టించారు. కొందరు గుండాలు బస్సులు, కార్లపై కూడా దాడి చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ 8లో ఏం జరుగుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు ప్రవేశిస్తారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంట్లోకి వెళ్ళేది వీళ్లే అంటూ కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్, యాంకర్ రీతూ చౌదరి, వర్షిణి, వేణు స్వామి, సురేఖ వాణి మరియు ఆమె కుమార్తె సుప్రీత గురించి కూడా ప్రస్తావించారు. వీరిద్దరూ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sai Pallavi: సాయి పల్లవి తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటుందా?

ఇకపోతే గత సీజన్ లో వరుణ్ సందేశ్, వితిక. మెరీనా, రోహిత్ లాంటి కపుల్స్ ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కపుల్ జంట కూడా ఇంట్లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇద్దరు జంటలకు విడివిడిగా గదులు ఏర్పాటు చేయనున్నారట. ఆ కపుల్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. వీరు మాత్రమే కాదు రీతూ చౌదరి మరియు వర్షిణి వంటి హాటీలు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్నారట. అయితే అధికారికంగా ప్రకటించే వరకు ఇంట్లోకి ఎవరు అడుగుపెడతారో ఇప్పుడే చెప్పలేం.. ఏం జరుగుతుందో చూద్దాం..