Rakshit Shetty case file on copyright 

Rakshit Shetty: కన్నడ సినిమా హీరోల సిచువేషన్ ఏమాత్రం బాగాలేదు. ఒకరి తర్వాత ఒకరు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. హీరో దర్శన్ వ్యవహారం కొలిక్కి వచ్చిందనుకుంటే తాజాగా స్టార్ హీరో రక్షిత్ శెట్టి వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రక్షిత్ శెట్టికి సమన్లు ​​జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. తన పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారనే ఆరోపణలతో రక్షిత్ శెట్టి ఈ వివాదం లో చిక్కుల్లో పడ్డారు.

నవీన్ కుమార్ అనే వ్యక్తి రక్షిత్ శెట్టి పై ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ MRT మ్యూజిక్‌ సంస్థ లో భాగస్వామి. రక్షిత్ శెట్టి ‘బ్యాచిలర్ పార్టీ’లో ‘న్యాయ ఎల్లిడు..’, ‘గాలిమాతు..’ పాటలను అక్రమంగా వాడుకున్నారు..’ అంటూ కేసు దాఖలు చేశాడు. ఇప్పటి వరకు రక్షిత్ శెట్టి పై కాపీరైట్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఏడాది జనవరిలో.. రక్షిత్ శెట్టిపై ఒక దావా వేసి సినిమా పాటలను ఉపయోగించడం గురించి చర్చలు జరిగాయి. అయితే “బ్యాచిలర్ పార్టీ” చిత్రం విడుదలైనప్పుడు ఈ కేసు ముందుకు సాగలేదు.

Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ షో లో దారుణం.. రొమాన్స్ చేస్తూ చిక్కిన జంట!!

నవన్ తన పాటల యొక్క ప్రసార హక్కులను కొనుగోలు చేయకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మౌఖిక విచారణకు హాజరు కావాల్సిందిగా నటుడు రక్షిత్ శెట్టికి నోటీసులు జారీ చేశారు వినికిడి. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో రక్షిత్ శెట్టి. ముఖ్యంగా రక్షిత్ నటించిన “777 చార్లీ”, సప్త సాగరల తీరాన వంటి సినిమా లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఏకం అనే వెబ్ సిరీస్‌ చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

For the pondering curious minds, seeking to know the answer to the most sought out question ‘who am I’.. here it is! #EKAM!

Out now, we hope you’ll enjoy this series as much as we loved bringing it to you

Streaming Now : https://t.co/ZQQK9QoE7y pic.twitter.com/f0xVoWnhj5

— Rakshit Shetty (@rakshitshetty) July 13, 2024